మద్యం మత్తులో ఎవరు ఏం చేస్తారో తెలియదు.
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ఎర్రగుంట గ్రామంలో ఒక తమ్ముడు అన్నను మద్యం మత్తులో కత్తితో పొడిచేశాడు.
మద్యం మత్తులో అన్నదమ్ముల మధ్య ఘర్షణ చెలరేగింది. తమ్ముడు బాలసుబ్రమణ్యం అన్న గురుబ్రహ్మం పై కత్తితో దాడి చేశాడు.
దాంతో అన్న కు తీవ్ర గాయాలు అయ్యాయి. మెరుగైన వైద్యం కోసం కర్నూల్ తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురుబ్రహ్మం (30) మృతి చెందాడు.
పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.