నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ సమస్యల మీద యువజన కాంగ్రెస్ నాయకులు కాలు దువ్వునున్నారు.శుక్రవారం యు టి ఎఫ్ భవనంలో యువజన కాంగ్రెస్ నాయకులు తాలుకా కార్యవర్గ సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాగర్ కర్నూల్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ కాంత్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ సమస్యల పైన యువజన కాంగ్రెస్ ప్రధానంగా దృష్టిసారించి సమస్యల పైన అలుపెరుగని పోరాటం చేయాలని కోరారు.
అదేవిధంగా యువజన కాంగ్రెస్ బలోపేతానికి గ్రామ స్థాయి నుండి మండల స్థాయిలో కమిటీలు వేయాలని ఆయన సూచించారు.అదేవిధంగా నియోజకవర్గ అధ్యక్షులు అనిల్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి మండలంలోనూ ఉన్న సమస్యల మీద పది రోజులకు ఒక మండలము చొప్పున అందరము కలిసి రాజీలేని పోరాటం చేద్దామన్నారు.
ఈ సందర్భంగా ఆరు మండలాల సమస్యలను చర్చించడం జరిగిందని ఆయన తెలిపారు.ఈ సమావేశానికి మాజీ యువజన కాంగ్రెస్ తాలుకా అధ్యక్షులు పుస్తకాల రాహుల్ , నాని యాదవ్ , కృష్ణా నాయక్ , నాగెష్ ,శేఖర్ , అలీమ్ , రాఘవేందర్ , శేఖర్ గౌడ్ , చంద్రకాంత్ రెడ్డి, చిత్తరంజన్ , శ్రీను ,దళపతి , బాల్ రాజు , శ్రీను నాయక్ , చందు ,మహేష్ , మల్లేష్ , రమేష్ , ఖాజా తదితరులు పాల్గొన్నారు.