మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్ లో విషాద ఘటన జరిగింది. పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా చిన్న శంకరం పెట్ మండల ఎస్ కొండాపూర్ గ్రామానికి చెందిన సాయిరాం కు పోలీసులకు మద్య వాగ్వాదం జరిగింది. వాగ్వాదం కారణంగా సాయిరాం ను అందరి ముందు పోలీసులు కొట్టారు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన సాయిరాం విద్యుత్ స్తంభం ఎక్కి కరెంట్ తీగలని పట్టుకోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని తూప్రాన్ ఏరియా హాస్పిటల్ కి తరలించారు.