సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారెడ్డిపేట చెరువులో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతదేహం లభ్యం అయింది.
పోతారెడ్డి పేట గ్రామానికి చెందిన మంగి రాజు(21) శుక్రవారం ఉదయం నాలుగు గంటలకు కాల్ రావడంతో ఇంటి నుండి మోటార్ బైక్ ఎక్కి వెళ్ళిపోయాడు.
అయితే ఆ తర్వాత తిరిగి రాలేదు. శుక్రవారం రోజు కుటుంబ సభ్యులు ఎంతగానో వెతికిన జాడ తెలియలేదు.
యువకుడి చెప్పులు, మోటార్ బైక్ చెరువు కట్ట పై ఉండడంతో అనుమానం వచ్చి చెరువులో చూడగా యువకుడి మృతదేహం నీటిపై తేలుతూ కనబడింది.
మంగి రాజును ఎవరో చంపి చెరువులో పడేశారని డాగ్ స్క్వాడ్ ను తీసుకురావాలంటూ కుటుంబ సభ్యులు పోతారెడ్డి పేట గ్రామ ముదిరాజ్ కులస్తులు పోలీసులను డిమాండ్ చేస్తున్నారు.
డాగ్ స్క్వాడ్ వచ్చేంత వరకు చెరువులోని శవాన్ని తీసే ప్రసక్తే లేదంటున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకున్నది