సమాజంలో ప్రతి వ్యక్తి సేవా దృక్పథంతో తమకు చేతనైన సహాయం చేయాలని హుజూర్ నగర్ తహసిల్దార్ జయశ్రీ అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ నందు మఠంపల్లి మండలం బక్క మంతులగూడెం గ్రామానికి చెందిన నాగలక్ష్మికి డాక్టర్ శివప్రసాద్ సూచన మేరకు రక్తం అవసరం ఏర్పడగా డీఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు సంప్రదించి రక్తం ఇప్పించి ఆపదనుడి అభాగ్యురాలిని కాపాడారు.
ఈ సందర్భంగా జయశ్రీ మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి ప్రతి వ్యక్తి తనకు చేతనైన సహాయం చేయాలని అన్నారు. రక్తదాన కార్యక్రమం చేస్తున్నడిఎస్ఆర్ ట్రస్ట్ సభ్యులను, రక్తం ఇచ్చిన దాత రామారావును ఆమె అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రీన, సుబ్బారావు, దగ్గుపాటి రాజేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.