రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నటి హీమజ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు వడ్డేశ్వరం (గుంటూరు) లోని తన నివాసంలో యూట్యూబ్ స్టార్ భాను మొక్కలు నాటారు. ఈ సందర్భంగా భాను మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా మంచి కార్యక్రమమని అన్నారు.
ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పచ్చదనం పెంచడం కోసం కృషి చేయాలని ఇది మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు. తనకు కూడ మొక్కలు నాటే అవకాశం రావడం సంతోషంగా ఉన్నదని భాను చెప్పింది. ఈ సందర్భంగా తాను మరొక ముగ్గురికి యువ సినీ ఆర్టిస్టులు నందు రామిశెట్టి, దీప్తి సొనైనా, క్రిష్టన్ రవళి లను మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.