దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా శిరీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొలిపాక సతిష్ కేక్ కట్ చేసి ప్రజలకు దాదాపు200 మాస్కులు పంపిణీ చేశారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అమలు చేసిన 108, 104, ఉచిత విద్యుత్, పావలా వడ్డీ రుణాలు రైతులకు రుణమాఫీ, ఫిజు రియంబర్స్ మెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు నిరుపేదలకు, గృహాలు లాంటి సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శిరీష్ రెడ్డి, జిల్లా కార్యదర్శి చింత ఎల్లయ్య, మేకల మల్లేశం, చిలుపురు మండల అధ్యక్షుడు గడ్డమీది సురేష్ మండల నాయకులు సింగపురం నాగయ్య, గట్టు కోటి, చల్లా తిరుపతి, నక్క పాపయ్య, రాజు, రాజేష్ రెడ్డి, సంతోష్, ప్రతుష్, ఎం.డి. సర్వర్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.