కడప జిల్లా రాజంపేట పట్టణంలో ని బైపాస్ లో గల మేడా నిలయం లో బుధవారం రాజంపేట శాసన సభ్యుడు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి వైస్సార్ చేయూత కార్యక్రమంను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్ మెప్మా అధికారి జె ఎప్రాయీమ్, డ్వాక్రా ఏపిఎం నిరంజన్ ,రాజంపేట ఎం డి ఓ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యోగేశ్వర్ రెడ్డి, శరత్ కుమార్ రాజు,ఉమామహేశ్వర్ రెడ్డి, చిదానంద గౌడ్, జనార్దన్ రెడ్డి, గోవింద బాలకృష్ణ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ భాస్కర్ రాజు మహిళా మండలి సభ్యులు, మెప్మా మహిళలు పాల్గొన్నారు.