విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని పేరుతో సింహాచలం భూములపై అధికార పార్టీ కన్నేసిందని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ అన్నారు. ఇప్పటికే బిల్డ్ ఏపీ పేరిట ప్రభుత్వ భూములు అమ్మేస్తున్నారని మాధవ్ అన్నారు.
రాజధాని విషయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒకేలా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.
చంద్రబాబు హయాంలో అమరావతిని కేంద్రంగా చేసుకుని భూ కుంభకోణాలకు పాల్పడ్డారని, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అదే పని విశాఖపట్నంలో చేస్తున్నదని ఆయన అన్నారు.
చంద్రబాబునాయుడి హాయంలో జరిగిన భూ కుంభకోణాలపై దర్యాప్తు చేసి, బాధ్యులపై చర్యలు చేపట్టాలితప్ప భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఎందుకు అన్యాయం చేస్తున్నదని ఆయన ప్రశ్నించారు.
నాడు రాజధానిగా అమరావతికి మద్దతు తెలిపిన జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చారని మాధవ్ విమర్శించారు.