38.2 C
Hyderabad
April 25, 2024 11: 02 AM
Slider నల్గొండ

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ హుజుర్ నగర్ నియోజకవర్గ బాధ్యుల నియామకం

#sharmila

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి  వైయస్ షర్మిల ఆదేశాల మేరకు హుజుర్ నగర్ నియోజకవర్గ మండలం,పట్టణ అధ్యక్షుల నియామక పత్రాన్ని తెలంగాణ పార్టీ ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్ వాడుక రాజగోపాల్ ఆదివారం విడుదల చేశారు.

ఈ సందర్భంగా హుజుర్ నగర్ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ కో-ఆర్డినేటర్ ఆదెర్ల శ్రీనివాసరెడ్డి  మాట్లాడుతూ తెలంగాణలో తెరాస ప్రభుత్వ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకోవడానికి  డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి  వైయస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్రకు అడుగడుగున ప్రజలు నీరాజనాలు పడుతున్నారని అన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కష్టపడి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని నాయకులకు కార్యకర్తలకు సూచించారు.

పాలకీడు మండల అధ్యక్షుడుగా కసిరెడ్డి జనార్దన్ రెడ్డి,హుజుర్ నగర్ మండల అధ్యక్షుడుగా శాసనాల ఆంజనేయులు, హుజుర్ నగర్ పట్టణ అధ్యక్షుడుగా కంచర్ల అరవింద్ రెడ్డి, మేళ్లచెర్వు మండల అధ్యక్షుడుగా అంచూరి పిచ్చిరెడ్డి, మఠంపల్లి మండల అధ్యక్షుడుగా ఉద్ధగిరి సామ్యూల్ జాన్, నేరేడుచర్ల మండలం అధ్యక్షుడుగా తిప్పన గోవర్ధన్ రెడ్డి,గరిడేపల్లి మండలం అధ్యక్షుడుగా చందా సైదిరెడ్డి, చింతలపాలెం మండలం అధ్యక్షుడుగా దొర్సల కృష్ణారెడ్డి ని నియమించడం జరిగిందని ఆదెర్ల శ్రీనివాసరెడ్డి తెలిపారు. సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

కరీంనగర్ లోతట్టు ప్రాంతాల్లో మంత్రి గంగుల పర్యటన

Satyam NEWS

తారకాసుర తో విజయ్ భాస్కర్ రెడ్డి పాల్యం విజయ దుందుభి మ్రోగించాలి

Satyam NEWS

ప్రజా సమస్యల పరిష్కరమే నా ధ్యేయం

Satyam NEWS

Leave a Comment