ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండల కేంద్రంలో మంగళవారం నిరుద్యోగుల పక్షాన వైఎస్ షర్మిల జరుపుతున్న నిరుద్యోగ దీక్షలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జీ ఆదెర్ల శ్రీనివాస రెడ్డి పాల్గొని నిరుద్యోగ దీక్షకు తన సంఘీ భావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆదెర్ల మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత చదువులు చదివి ఉద్యోగం కొరకు ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతీ,యువకుల కోసం ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసేంతవరకు వైఎస్ షర్మిల చేపట్టిన నిరుద్యోగ దీక్ష్య ద్వారా నిరుద్యోగుల పక్షాన నిలబడి తెలంగాణ ప్రభుత్వంతో పోరాడుతామని అన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్