28.7 C
Hyderabad
April 25, 2024 05: 04 AM
Slider నల్గొండ

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సన్నాహక కమిటీ సభ్యుడుగా ఆదెర్ల

#ysrtp

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌ రెడ్డి జ‌యంతి సందర్భంగా వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో ఆవిర్భావించబోతున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సన్నాహక కమిటీ లో తనను నియోజకవర్గ  సభ్యునిగా నియమించారని ఆదెర్ల శ్రీనివాస రెడ్డి తెలిపారు.

బుధవారం హైదరాబాద్  లోటస్ పాండ్ లో తెలంగాణ రాష్ట్ర అన్ని జిల్లాల ముఖ్యనేతలతో సమావేశం ఏర్పాటు జరిగిందని, ఈ సందర్భంగా పార్టీ ఏర్పాటు, విధి, విధానాల గురించి ఈ సమావేశంలో చర్చించడం జరిగిందని ఆయన తెలిపారు.

తెలంగాణలో పార్టీ బలోపేతానికి ముందుగా సన్నాహక కమిటీలను వేయడం జరిగిందని ఆయన వివరించారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి తనకు చోటు కల్పించి సందర్భంగా ఆదెర్ల శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో పార్టీ సన్నాహక కమిటీలో తనను సభ్యునిగా ఎంపిక చేసి  ప్రాధాన్యతను ఇచ్చిన షర్మిల కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

నియోజకవర్గ స్థాయిలో YSR తెలంగాణ పార్టీ బలోపేతానికి అందరిని కలుపుకొని ముందుకు సాగుతానని అన్నారు.

Related posts

కరోనా… ఇక ఈ రాజ్యం నీదే ఏలుకో

Satyam NEWS

పెన్నానదిలో బయట పడిన పురాతన ఆలయం

Satyam NEWS

రవి ప్రకాశ్ చేతికి వచ్చిన మహాన్యూస్ ఛానెల్

Satyam NEWS

Leave a Comment