తిరుపతి పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఆ పార్టీ నేతలు ప్రచారం చేశారు.
నెల్లూరు జిల్లా వెంకటగిరి 7 వ వార్డు లో నేడు ముమ్మర ప్రచారం చేశారు. వెంకటగిరి మున్సిపల్ 7వ వార్డు కౌన్సిలర్ కోటంరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఇంటింటికి ప్రచారం చేశారు.
పార్టీ ప్రచార కరపత్రాలను వారికి అందజేసి ఓట్లు అభ్యర్ధించారు. ఈ ప్రచార కార్యక్రమంలో వైయస్సార్ సిపి నాయకులు, మాజీ కౌన్సిలర్ రోసిరెడ్డి, మున్సిపాలిటీ బూత్ కన్వీనర్ మల్లిరెడ్డి, కొక్కు శ్రీనివాసులు రెడ్డి, నరేష్ రెడ్డి, పేచీ రాజ్, శ్యామ్, శివ, దయాకర్ తదితర నాయకులు కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. వెంకటగిరి సామాన్యుడు