39.2 C
Hyderabad
March 28, 2024 16: 00 PM
Slider కడప

బీసీలకు న్యాయం చేయాలి… టీడీపీ బిసినేతల నిరసన..

#tdpnandaluru

తెలుగుదేశం పార్టీ బీసీసెల్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా నందలూరు ఎమ్మార్వో  కార్యాలయం సోమవారం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ  బీసీసెల్ రాష్ట్ర ఉప అధ్యక్షుడు తాటి సుబ్బరాయుడు క మాట్లాడుతూ అనాదిగా బిసిలకు స్థానిక సంస్థల్లో 34శాతం రిజర్వేషన్లు ఉంటే ఈ ప్రభుత్వం వచ్చాక దానిని 24 శాతానికి తగ్గించి దాదాపు 16800 స్థానిక సంస్థలు పదవులను పొందే అవకాశాన్ని నాశనం చేశారు అని ఆరోపించారు.

అలాగే సబ్సిడీ రుణాలు లేకుండా చేసారని, 36 వేల కోట్ల రూపాయల సాబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టించారని అన్నారు. బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటి సుబ్బరాయుడు మాట్లాడుతూ 56 కార్పొరేషన్స్ పెట్టి కనీసం ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం బీసీలను ఎంత తీవ్రంగా వంచిస్తున్నారో అర్థం అవుతుంది అని అన్నారు.

వెంటనే నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వంలో బిసిలకు అడుగడుగునా అన్యాయం జరుగుతుందని, ఆదరణ పధకం పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మార్వో కి డిమాండ్లతో కూడిన విన్నతపత్రం సమర్పించారు సమర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బిసిలు గొబ్బిళ్ళ సుబ్బరాయుడు, చామంచి పెంచలయ్య, కానాకుర్తి వెంకటయ్య, తుంటి రమణయ్య జంగం శెట్టి సుబ్బయ్య, కుర్ర మనీ తదితరులు పాల్గొన్నారు.

Related posts

డ్రామారావులు డ్రామాలను బంద్ చెయ్యాలి : నూనె బాల్ రాజ్

Satyam NEWS

పోలీసుల సాయంతో చెలరేగిపోయిన దొంగలు

Satyam NEWS

పెట్రోల్, డీజిల్ బహిరంగ దోపిడీకి నియంత్రణ లేదా

Satyam NEWS

Leave a Comment