కడప జిల్లా రాజంపేట మండలం మన్నూరు అరుంధతి వాడ లో ఆదివారం నాడు పేదలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యన్.ఆర్.ఐ నాయకుడు రత్నాకర్ ఆధ్వర్యంలో రాజంపేట మాజీ శాసన సభ్యుడు, జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి, పట్టణ వైసీపీ కన్వీనర్ పోలా శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాదాపు మూడు వందల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మర్రి రవి, కువైట్ యూత్ కన్వీనర్ మర్రి కళ్యాణ్, మోహన్, రవి యాదవ్, రెడ్డియ్య, రఘు యాదవ్, పోలి మురళి, సుబ్బరాజు, కొరముట్ల హరి, మాత రమణ తదితరులు పాల్గొన్నారు.