దివంగత సీనియర్ నాయకులు, విజయనగరం జిల్లాకు చెందిన పెన్మత్స సాంబశివరాజు తనయుడు డా. పెన్మత్స సూర్యనారాయణరాజు ( డా. సురేష్బాబు)ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దింపాలని సీఎం, వైయస్సార్ సీపీ అధ్యక్షుడు వైయస్.జగన్ నిర్ణయించారు.
రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మోపిదేవి వెంకటరమణ రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీటుకు త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ స్థానానికి సురేష్ బాబు పేరును జగన్ నిర్ణయించారు.