వైస్సార్సీపీ ఎంపీలు రాజీనామాల తోనే ప్రత్యేక హోదా వస్తుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఒత్తిడి తెచ్చి ఎంపీల రాజీనామాలు చేసేలా ఉద్యమం చేయాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు.
బీజేపీ పై తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ప్రత్యేక హోదా కోసం జనసేన గాజుగ్లాసు గుర్తు తీసుకుని నవతరం పార్టీ పోరాడిన విషయం గుర్తు చేశారు.
జనసేన ప్రత్యేక హోదా కోసం జనసేన తెగదెంపులు చేసుకోవాలి అని డిమాండ్ చేశారు.
గుంటూరు లో ఆదివారం ఉదయం11 గంటల కు ప్రారంభమైన ప్రత్యేక హోదా, విభజన హామీలు సాధనా సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో నవతరం పార్టీ నేతలు వి గణేష్ కుమార్,వెల్లాల సాయి,ఎం విజయరాజు తదితరులు పాల్గొన్నారు.