భారత్ నుంచి పారిపోయి మలేషియాలో తలదాచుకుంటున్న ఇస్లామిక్ బోధకుడు జకీర్ నాయక్ భారత్ లో ముస్లింలు అనుభవిస్తున్న కష్టాలపై సానుభూతి వ్యక్తం చేశాడు. గత ఆరు సంవత్సరాలుగా భారత్ లో ముస్లింలు అణచివేతకు గురి అవుతున్నారని జకీర్ నాయక్ అన్నాడు.
ఈ మేరకు ఆయన ఫేస్ బుక్ లో ఒక వీడియోను అప్ లోడ్ చేశాడు. ఇస్లాంలోని వివిధ వర్గాలకు చెందినందున భారత్ లోని ముస్లింలు ఐక్యం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
అంతే కాకుండా భారత్ ముస్లింలు వివిధ పార్టీలలో ఉంటున్నారని అలా కాకుండా ముస్లింలు అందరూ కలిసి ఒక పార్టీ పెట్టుకోవాలని ఆయన సూచించాడు.
ముస్లింలు మెజారిటీ ఉన్న దేశాలకు భారత్ ముస్లింలు వలస వెళ్లడం ఉత్తమమైన విధానమని లేకపోతే భారత్ లో అణచివేతకు గురి కావాల్సి వస్తుందని జకీర్ నాయక్ అన్నాడు.