39.2 C
Hyderabad
April 23, 2024 17: 24 PM
Slider

ముస్లింలకు అనుకూలంగా మాట్లాడినా స్వర్గం దక్కదు

#Zakeer Naiak

ముస్లింలకు అనుకూలంగా మాట్లాడినా సరే రావిష్ కుమార్ లాంటి వాళ్లు స్వర్గానికి పోలేరని ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ అన్నారు. డాక్టర్ జకీర్ నాయక్ నిర్వహించే ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఒక వ్యక్తి రావిష్ కుమార్ గురించి ప్రశ్నించాడు. ఎన్ డి టి వి లో పని చేసే రావిష్ కుమార్ ముస్లింలకు పూర్తిగా అనుకూలంగా ప్రతి షోలో మాట్లాడతారు. ముస్లింల పక్షాన నిలబడి ఆయన వాదిస్తుంటారు.

ఇలా ముస్లింలకు బేషరతుగా మద్దతు పలికే రావిష్ కుమార్ లాంటి వారు స్వర్గానికి వెళతారా అని ఒక వ్యక్తి జకీర్ నాయక్ ను ప్రశ్నించాడు. దీనికి జకీర్ నాయక్ సమాధానం చెబుతూ రావిష్ కుమార్ ముస్లింల పట్ల ఎంతగా అనుకూలంగా మాట్లాడినా కూడా స్వర్గానికి వెళ్లే అవకాశం లేదని ఆయన అన్నారు.

ముస్లిం మరణం పొందలేని వారికి స్వర్గంలో ప్రవేశం ఉండదని ఆయన వివరించారు. అంతే కాకుండా ఎక్కువ మంది దేవుళ్లను పూజించినందున రావిష్ కుమార్ కు స్వర్గంలో ప్రవేశం ఉండదని ఆయన అన్నారు. ఒక్క రావిష్ కుమారే కాకుండా అలాంటి వాళ్లుచాలా మంది ఉన్నారని, ముస్లింల పక్షాన వాదించినంత మాత్రాన వారికి సద్గతి ప్రాప్తించదని జకీర్ నాయక్ అన్నారు.

ముస్లింగా మరణించాలని అప్పుడే వారికి సద్గతి ఉంటుందని జకీర్ నాయక్ తెలిపారు. అంటే వారు ముస్లిం మతం తీసుకోవాల్సిందేనని అప్పుడే స్వర్గానికి వెళతారని ఆయన అన్నారు.

Related posts

వైయస్ భాస్కర్ రెడ్డి అరెస్టు పై సీబీఐ దిష్టిబొమ్మ దగ్దం

Satyam NEWS

శభాష్ పోలీస్: నేర నియంత్రణలో మేలు ఫలితాలు

Satyam NEWS

సామాన్య‌ ప్ర‌జ‌ల ఆశ‌లు… ఆకాంక్ష‌లు నెర‌వేరాయి

Satyam NEWS

Leave a Comment