చిత్తూరుహోమ్

విద్యార్థిని పుర్రె ఎముకకు గాయమయ్యేలా కొట్టడం దారుణం

#PawanKalyan

చిత్తూరు జిల్లా పుంగనూరులోని భాష్యం స్కూల్ లో- ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని సాత్విక నాగశ్రీ తలపై ఉపాధ్యాయుడు కొట్టడం మూలంగా పుర్రె ఎముక చిట్లిందని తెలిసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు.

పుర్రె ఎముక చిట్లడం మూలంగా తీవ్ర సమస్యలు తలెత్తిన విషయం ఉప ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. ఈ ఘటన వివరాలు తెలుకోవాలని తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. తరగతి గదిలో అల్లరి చేస్తుందనే కారణంతో స్కూల్ బ్యాగ్ తో విద్యార్థిని తలపై ఉపాధ్యాయుడు కొట్టారని, ప్రస్తుతం ఆ బాలికకు బెంగళూరులో కుటుంబ సభ్యులు వైద్యం చేయించి ఇంటికి తీసుకువచ్చినట్టు అధికారులు తెలిపారు.

ఆరు నెలలపాటు బాలిక ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తూ ఉండాలని వైద్యులు సూచించినట్లు కుటుంబ సభ్యులు తెలిపినట్లు  వివరించారు. ఈ ఘటన ఎంతో బాధాకరమైనదని, పాఠశాలల్లో విద్యార్థులను పాతకాలం మాదిరి దండించే విధానాన్ని విద్యావేత్తలు, మానసిక శాస్త్రవేత్తలు అంగీకరించడం లేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.

స్కూల్లో అయినా, ఇంట్లో అయినా అల్లరి చేయడం లాంటివి చోటు చేసుకొంటే… అదుపు చేసేటప్పుడు కూడా పిల్లల మానసిక ధోరణులను ఉపాధ్యాయులు, తల్లితండ్రులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Related posts

జై అమరావతి అంటూ విజయనగరంలో భారీ ర్యాలీ

Satyam News

గో సేవలో ఎక్సైజ్ శాఖ మంత్రి….

Satyam News

“లవ్ ఇన్సూరెన్స్” ఈ పదం విన్నారా?

Satyam News

హెరిటేజ్ పై తప్పుడు సమాచారం ఇచ్చిన బొత్స

Satyam News

చిన్నారి అదృశ్యం ఘటనపై పవన్ కళ్యాణ్ ఆరా

Satyam News

రాయచోటి భద్రకాళి ఆలయానికి వచ్చిన సజ్జనార్

Satyam News

Leave a Comment