చిత్తూరు హోమ్

ప్రభుత్వ డాక్టర్లపై దాడులకు పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు

చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్లు, సిబ్బందిపై దాడులకు పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వైద్యారోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్లు, సిబ్బందిపై శుక్రవారం అర్ధ రాత్రి కొందరు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. సిబ్బంది వ్యవహారశైలిలో లోపాలేమైనా ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చెయ్యాలే తప్ప భౌతిక దాడులకు పాల్పడడం తగదన్నారు. వైద్య సిబ్బంది నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించడం సరైన విధానం కాదన్నారు.

Related posts

జనసేన ఎమ్మెల్యేలు జాగ్రత్త: పవన్

Satyam News

విద్యార్థినులను లైంగికంగా వేధిస్తున్న స్వామీజీ

Satyam News

పెన్సిల్వేనియాలో కాల్పులు: ఒకరి హత్య

Satyam News

Leave a Comment

error: Content is protected !!