ప్రత్యేకం హోమ్

కాళేశ్వరంపై హరీష్ రావు ఘాటు లేఖ

#HarishRao

వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు నింపాలంటూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. రిజర్వాయర్ లలో నీటిని సకాలం లో నింపక పోవడం వల్ల పంటల సాగు ముందుకు పోక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని హరీష్ రావు తెలిపారు.

ప్రాజెక్టు పరిధిలో వివిధ జిల్లాలోని రిజర్వాయర్లు మిడ్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్ లను నింపి సుమారు 5 లక్షల ఎకరాల ఆయకట్టు పరిధిలోని రైతుల ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ప్యాకెజ్-6 వద్ద గల మోటార్లను ఆన్ చేసి నీటి పంపింగ్ చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

లేఖలోని ముఖ్యాంశాలు ఇవి:

ప్రస్తుత వానాకాలం పంట సీజన్ లో రైతులు ఇటు వర్షాభావం, అటు ప్రాజెక్టుల్లో రిజర్వాయర్ లలో నీటిని సకాలం లో నింపక పోవడం ద్వారా పంటల సాగు ముందుకు పోక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్న విషయం తెల్సిందే. ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వలన వచ్చే ప్రతి నీటి చుక్కని ఒడిసి పట్టడం కోసం సకాలంలో కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ లను ఆన్ చేయాలని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాను.

కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగమైన శ్రీ పాద ఎల్లంపల్లి రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 20 టి.ఎం.సి లు, ప్రస్తుత సుమారు 14 టి.ఎం.సి ల నీటి లభ్యత ఉన్నది, కడెం నుండి దాదాపు 22,300 క్యూసెక్కుల వరద ఉంది. అదేవిదంగా శ్రీరాం సాగర్ ప్రాజెక్టు లో (SRSP ) పూర్తి నీటి సామర్థ్యం 80 టి.ఎం.సీ లు, ప్రస్తుతం సుమారు 45 టి.ఎం.సీల నీటి లభ్యత ఉన్నది.

అదేరకంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వలన గోదావరిలో ఇన్ ఫ్లోస్ పెరిగిన విషయం మీకు తెలిసిందే. ఇట్టి విషయం దృష్టిలో ఉంచుకొని కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని ప్యాకెజ్ -6 వద్ద గల నంది పంప్ హౌస్ లోని మోటార్లను ఆన్ చేసి నీటి పంపింగ్ ప్రారంభించి తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మిడ్ మానేరు, అన్నపూర్ణ (అంతగిరి), రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ తదితర రిజర్వాయర్ లను నింపాలని డిమాండ్ చేస్తున్నాo. ఆయా రిజర్వాయర్ల పరిధిలోని చెరువులను,  చెక్ డ్యామ్ లను  అన్నింటిని నింపి సుమారు 5లక్షల ఎకరాల కు నీరందించేలా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నీటి పంపింగ్ చేపట్టాలని రైతుల పక్షాన కోరుతున్నాను..

లోయర్ మానేరు డ్యామ్ (LMD) పూర్తి నీటి సామర్థ్యం 24 టి.ఎం.సి లు, ప్రస్తుత నీటి లభ్యత 7టి.ఎం.సి లు ఉన్నాయి. మిడ్ మానేరు నుండి లోయర్ మానేరు (LMD) కు నీటిని నింపి S.R.S.P STAGE -2 లోని అవసరమగు  ఆయకట్టు కు ఖరీఫ్ మరియు రబీ పంటకు నీరు అందించి రైతులను అదుకోవాలని విజ్ఞప్తి.

గత యాసంగి పంట లో కాళేశ్వరం ప్రాజెక్టు లోని రిజర్వాయర్ల పై ఆయకట్టు పరిధిలో 5లక్షల ఎకరాలు సాగు అయిన విషయం గుర్తించి ఈ వానాకాలం పంటకి  అదేవిదంగా వచ్చే యాసంగి పంటకు కూడ సాగు నీరు అందించేల కాళేశ్వరం ప్రాజెక్టు అంతర్భాగంలోని అన్ని రిజర్వాయర్ నింపి తద్వారా వాటి అనుసంధానం గా నిర్మించిన కాలువ లు, చెరువు లు చెక్ డ్యామ్ ల అన్నింటిని నింపి రైతుల్లో నెలకొన్న ఆందోళనను తొలగించి రైతు సాగు ప్రయోజనాల దృష్ట్యా రాజకీయలకు అతీతంగా వెంటనే నీటి పంపింగ్ ప్రారంభించేల  చర్యలు చేపట్టాలని కోరుతున్నాను..

Related posts

భారత దేశానికి నిజంగా స్వాతంత్య్రం వచ్చిందా?

Satyam News

నిష్పాక్షిక విశ్లేషణ: బీహార్ లో గెలుపు ఎవరిది?

Satyam News

ప్రభుత్వ డాక్టర్లపై దాడులకు పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు

Satyam News

Leave a Comment

error: Content is protected !!