ప్రత్యేకం హోమ్

గండిపేట కు భారీ గా వరద నీరు

హైదరాబాద్‌ సిటీ జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌ (గండిపేట), హిమాయత్‌సాగర్లకు మళ్లీ వరద మొదలైంది. ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండడంతో ఈసీ, మూసీ నదుల్లో వరద వస్తోంది. హిమాయత్‌సాగర్‌, గండిపేట జలాశయాల్లో 250 క్యూసెక్కుల చొప్పున వరద వచ్చి చేరుతోంది. దీంతో వాటర్‌బోర్డు అధికారులు అప్రమత్తమయ్యారు.

జలాశయం ఒక గేటును అడుగు మేర, గండిపేట జలాశయం రెండు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గండిపేట రెండు గేట్ల ద్వారా 226 క్యూసెక్కుల నీటిని దిగువన మూసీలోకి వదులుతున్నారు. హిమాయత్‌సాగర్‌ రెండు గేట్ల ద్వారా 339 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు. దీంతో మూసీనదిలో వరద ప్రవాహం పెరిగింది.

Related posts

సోషల్ మీడియా నియంత్రణ సాధ్యమేనా?

Satyam News

సుభాష్ నేరాన్ని సమర్థించే వారు ఇది తెలుసుకోవాలి….

Satyam News

వనపర్తిలో లక్షల్లో అద్దె-వేలల్లో టాక్స్

Satyam News

Leave a Comment

error: Content is protected !!