26.7 C
Hyderabad
September 20, 2026
తూర్పుగోదావరిహోమ్

ఉల్లాస్ అక్షరాంధ్రతో 100% అక్షరాస్యత లక్ష్యం

#Kakinada

ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా నగరంలో నూరుశాతం అక్షరాస్యత సాధించడం లక్ష్యమని కాకినాడ కమిషనర్ భావన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం స్మార్ట్ సిటీ మీటింగ్ హాల్‌లో 463 మంది వాలంటీర్ టీచర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది.

వీరు మొదటి విడతలో ఎంపికైన 4,634 మంది నిరక్షరాస్యులకు విద్య అందించనున్నారు. విద్యను ఏ విధంగా బోధించాలో ఈ శిక్షణలో వాలంటీర్లకు మెలకువలు అందించారు. టౌన్ ప్రాజెక్ట్ ఆఫీసర్  కె. శైలజ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, “నగరాన్ని నూరు శాతం అక్షరాస్యుల నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం. ఈ లక్ష్యం సాధనలో వాలంటీర్లు కీలక పాత్ర పోషించాలి” అన్నారు.

వయోజన విద్యా శాఖ ప్రతినిధి రాజేష్ మాట్లాడుతూ, “ప్రతి వాలంటీర్ రోజుకు ఒక గంటపాటు సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్య వయోజనులకు చదువు బోధించాలి” అని సూచించారు. కార్యక్రమంలో మెప్మా సిటీ మిషన్ మేనేజర్ డి. వెంకటరాజు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జగన్ సైతాన్ సైన్యం పై షర్మిల సంచలన ఆరోపణ

Satyam News

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోం

Satyam News

అమరావతికి మరో భారీ గుడ్‌ న్యూస్‌…!!

Satyam News

తెలంగాణ లో ‘‘సర్’’ అమలుపై చర్యలు

Satyam News

పీఎం విశ్వకర్మ లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం

Satyam News

కూటమికి తిరుగులేదు జగన్ పార్టీకి బతుకులేదు

Satyam News

Leave a Comment