కృష్ణహోమ్

ఆపరేషన్ నేపాల్ రెస్క్యూ: సక్సెస్ చేసిన లోకేష్

#OperationNepal

నేపాల్ లో చిక్కుకు పోయిన ఆంధ్రప్రదేశ్ వాసులు మంత్రి నారా లోకేష్ చొరవతో నేపాల్ లోని ఖాట్మాండూ విమానాశ్రయం నుంచి రాష్ట్రానికి బయలుదేరారు. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో 144 మంది తెలుగు వారు బయలు దేరారు.

ఖాట్మాండూ నుంచి మొదటగా విశాఖపట్నం విమానాశ్రయానికి ప్రత్యేక విమానం చేరుకున్నది. అనంతరం తిరుపతి విమానాశ్రయానికి ఆ ప్రత్యేక విమానం చేరుకుంటుంది. విశాఖకు 104 మంది ఏపీ వాసులు, మరో 40 మంది తిరుపతికి చేరుకుంటారు. కూటమి ప్రభుత్వం ఏపీ వాసులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది.

అదే విధంగా విశాఖ, తిరుపతి విమానాశ్రయాల్లో తెలుగు వారికి స్వాగతం పలికేందుకు కూటమి ఎమ్మెల్యేలు, అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఆయా విమానాశ్రయాల నుంచి వారి స్వస్థలాలకు చేర్చేందుకు అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది.

నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారి కోసం రెండు రోజులుగా ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మంత్రి నారా లోకేష్ పర్యవేక్షిస్తూనే ఉననారు. నేపాల్ లో చిక్కుకున్న వారిని సురక్షితంగా రాష్ట్రానికి రప్పించేందుకు కృషిచేసిన నారా లోకేష్ కు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Related posts

బతుకమ్మ యంగ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ ఛాలెంజ్‌ 2026 పోస్టర్ ఆవిష్కరణ

Satyam News

భోగాపురం విమానాశ్రయం రాష్ట్ర అభివృద్ధికి నూతన అధ్యాయం

Satyam News

ఇరిగేషన్ ప్రాజెక్టులతో జిల్లా సస్యశ్యామలం

Satyam News

ఆ ఒక్క కారణంతో.. కూటమిలో తిరుగులేని ఐక్యత

Satyam News

చీకటి పొత్తులకు బ్రాండ్ అంబాసిడర్ జగన్

Satyam News

కోవర్టు ఆపరేషన్లతో రేవంత్ కు పరేషాన్

Satyam News

Leave a Comment