26.7 C
Hyderabad
September 20, 2026
ముఖ్యంశాలుహోమ్

జంగిల్ రాజ్ పై నిప్పులు చెరగిన మోడీ

#BiharElections

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సమస్తిపూర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న ఆయన, ఈసారి బీహార్‌లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ) చరిత్రలోనే అతిపెద్ద విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రధాని మాట్లాడుతూ, “ఈసారి ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ నాయకత్వంలో ఎన్‌డీఏ అన్ని గత రికార్డులను బద్దలు కొడుతుంది. బీహార్‌ ప్రజలు ఎన్‌డీఏకు ఇప్పటివరకు లభించని భారీ మెజారిటీని అందిస్తారు,” అని అన్నారు. మోదీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ, మంచి పాలనకు ఓటు వేయాలని, అశాంతి, అవినీతి పాలనకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.

“ప్రజాస్వామ్య మహోత్సవం బీహార్‌లో ప్రారంభమైంది. మొత్తం బీహార్‌ ఒకే స్వరంతో చెబుతోంది ‘ఫిర్‌ ఏక్‌ బార్‌ ఎన్‌డీఏ సర్కార్‌, ఫిర్‌ ఏక్‌ బార్‌ సుసాసన్‌ సర్కార్‌’. జంగిల్‌రాజ్‌ వాలోం కో దూర్‌ రఖేగా బీహార్‌,” అని ఆయన నినదించారు. బీహార్‌ అభివృద్ధి కోసం కేంద్రం తీసుకొచ్చిన పథకాలను వివరించిన మోదీ, గత పదేళ్లలో బీహార్‌లో మౌలిక వసతులు, విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత రంగాల్లో పెద్ద ఎత్తున మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పారు.

ఈ అభివృద్ధి నిరంతరంగా కొనసాగాలంటే ఎన్‌డీఏ ప్రభుత్వానికి మరోసారి అవకాశమివ్వాలని కోరారు. ప్రజల ఆశలు, అభీష్టాలను నెరవేర్చే ప్రభుత్వం కావాలంటే స్థిరత్వం అవసరమని, నితీశ్‌ కుమార్‌ నాయకత్వంలో బీహార్‌ మరింత ముందుకు సాగుతుందని ప్రధాని పేర్కొన్నారు. సమస్తిపూర్‌ సభలో పెద్ద ఎత్తున జనసందోహం హాజరై “మోదీ, మోదీ”, “నితీశ్‌ జీ జిందాబాద్‌” నినాదాలతో మార్మోగింది.

Related posts

మమతా బెనర్జీ ప్రభుత్వం డిస్మిస్ చేసిన గవర్నర్

Satyam News

హిందువుల మనోభావాలతో వైకాపా ఆటలు?

Satyam News

కల్తీ పాలు తాగి ఇద్దరు మృతి?

Satyam News

జోగినపల్లి కి ఫ్లోరా శైని సెల్యూట్

Satyam News

21 వ తేదీ నుండి సరస్వతీ నదీ అంత్య పుష్కరాలు

Satyam News

వృద్ధి రేటు పెరుగుదలపై సీఎం చంద్రబాబు సమీక్ష

Satyam News

Leave a Comment