చిత్తూరు హోమ్

తిరుమల పరకామణి చోరీలో సంచలన విషయాలు….

#Parakamani

తిరుమలలోని పరకామణిలో భారీ దొంగతనం జరిగిన విషయంపై టిటిడి బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి శనివారం సంచలన ఆరోపణలు చేశారు. ఆయన విడుదల చేసిన వీడియోల్లో రవికుమార్ అనే వ్యక్తి పరకామణిలో దొంగతనం చేస్తున్న దృశ్యాలు బయటపడ్డాయి.

భాను ప్రకాష్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం, రవికుమార్ ఏళ్లుగా చోరీ చేసి వచ్చిన డబ్బును కోట్లు రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టాడని ఆరోపించారు. ఈ దొంగతనంలో రవికుమార్ మాత్రమే కాకుండా మరికొంత మంది నేతలు, అధికారులు కూడా భాగస్వాములయ్యారని ఆయన వ్యాఖ్యానించారు.

గత వైసిపి ప్రభుత్వ హయాంలో భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో సమర్పించిన స్వామివారి హుండీ కానుకల్లో నుంచి పరకామణిలో దాదాపు 100 కోట్ల రూపాయల దొంగతనం జరిగిందని భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటన టిటిడి చరిత్రలోనే అతి పెద్ద స్కాంగా నిలిచిందని పేర్కొన్నారు.

ఈ కేసును హైకోర్టు సిఐడికి అప్పగించగా ఒక నెల రోజుల్లో సీల్డ్ కవర్‌లో విచారణ నివేదిక ఇవ్వాలని ఆదేశించిందని చెప్పారు. బోర్డు తీర్మానాలు సహా ఇతర కీలక పత్రాలను సీజ్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అప్పటి కేసు లోక్ అదాలత్ ద్వారా రాజీకి వెళ్ళిందని, ఈ కుంభకోణంలో వైసిపి ప్రముఖులు, ఉన్నతాధికారులు కూడా ప్రమేయం ఉన్నారని ఆరోపించారు.

వీరందరి పేర్లు త్వరలో బయటకు వస్తాయని ఆయన హెచ్చరించారు. త్వరలోనే ఒక కీలక అధికారి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఈ 100 కోట్ల స్కాంను బహిర్గతం చేయనున్నారని తెలిపారు. ఈ వ్యవహారంలో కీలకమైన ఒక పోలీస్ అధికారి స్వామివారి నిధులను దోచుకోవడమే లక్ష్యంగా పనిచేశాడని భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు.

దోచుకున్న డబ్బులో కొంత భాగం తాడేపల్లి ప్యాలెస్ కి మళ్లించారని, కేసులో అన్ని సాక్ష్యాధారాలను తరువాత ధ్వంసం చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ భారీ కుంభకోణం జరిగిన సమయంలో టిటిడి చైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారని, ఇప్పుడు దీనిపై ఆయన సమాధానం చెప్పాలని భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. మొత్తం మీద, తిరుమలలో భక్తుల సమర్పణలపై జరిగిన ఈ 100 కోట్ల స్కాం పై భానుప్రకాశ్ రెడ్డి చేసిన ఆరోపణలు పెద్ద సంచలనం రేపాయి.

Related posts

ఉచిత వైద్య శిబిరం విజయవంతం

Satyam News

బతుకమ్మ వేడుకలపై చిన్నచూపు ఏల?

Satyam News

పులివెందుల వార్ 2: ఓటుకి వేల నోట్లు….!!

Satyam News

Leave a Comment

error: Content is protected !!