26.3 C
Hyderabad
September 19, 2026
హైదరాబాద్హోమ్

వీసాల పట్ల అప్రమత్తత అవసరం

విద్యార్థులు, ఉద్యోగులు వీసాలు, ఇమిగ్రేషన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కావేటి ఇంటర్నేషనల్ లా ఫర్మ్ సంస్ధ అధ్యక్షుడు కావేటి శ్రీనివాసరావు అన్నారు. మల్కాజిగిరి పీవీఎం కాలనీలో కావేటి ఇంటర్నేషనల్ లా ఫర్మ్ నూతన శాఖను ప్రారంభించారు. సంస్థ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ పార్టనర్ డాక్టర్ కావేటి శ్రీనివాస్ రావు పిట్టల సునీల్ కుమార్ (సునీల్ అసోసియేట్స్ వ్యవస్థాపక భాగస్వామి) రిబ్బన్ కటింగ్ చేశారు.

అనంతరం, అతిథులు ప్రాంతీయ న్యాయ అవసరాలపై కేంద్రీకరించిన చర్చా సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ కావేటి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ఈరోజు జరిగిన విస్తృత హాజరు స్థానికంగా అందించబడే అంతర్జాతీయ ప్రమాణాల న్యాయసేవలకు ఉన్న పెరుగుతున్న అవసరాన్ని సూచిస్తుందన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ న్యాయ సందేహాలకు సంబంధించి ఎటువంటి అనుమానాలు ఉన్న తాము ఉచితంగా నివృత్తి చేస్తామని చెప్పారు.

కార్పొరేట్ లిటిగేషన్ & కమర్షియల్ వివాదాలు, అంతర్జాతీయ మధ్యవర్తిత్వం, మౌలిక సదుపాయాలు & నిర్మాణ చట్టం, వలస (ఇమ్మిగ్రేషన్) చట్టం, టెక్నాలజీ, డేటా & కాంప్లయెన్స్, ట్రేడ్‌మార్క్ అండ్ పేటెంట్, ఫ్యామిలీ లా, ప్రపంచ వ్యాప్తి, స్థానిక నిబద్ధత, కావేటి ఇంటర్నేషనల్ లా ఫర్మ్ ఒక ఫుల్-సర్వీస్ గ్లోబల్ ప్రాక్టీస్, దీని ప్రధాన కార్యాలయం అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉండగా యునైటెడ్ కింగ్డమ్, దుబాయ్, కెనడా, హైదరాబాద్, తిరుపతి, కరీంనగర్ , విజయవాడలో శాఖలు ఉన్నాయన్నారు.

మల్కాజగిరి ఒక వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం అని, తమ కార్యాలయం ప్రజలకు సేవలు అందించడానికే రూపుదిద్దుకుందని పిట్టల సునీల్ కుమార్ అన్నారు. ఈ భాగస్వామ్యం పద్మారావునగర్, మల్కాజగిరి పరిసర ప్రాంతాల క్లయింట్లకు మరింత సమర్థవంతమైన న్యాయసేవలను అందిస్తుందన్నారు. లావాదేవీల నుండి వివాద పరిష్కారం వరకు అన్ని రంగాల్లో వేగవంతమైన, సమన్వయ న్యాయ సహాయం అందించడం మరింత సులభం కానుందని చెప్పారు,

మల్కాజగిరి కార్యాలయం చిన్న మరియు మధ్యతరహా వ్యాపారాలు , స్టార్టప్‌లు, మరియు స్థిర సంస్థలకు కార్పొరేట్, కమర్షియల్, నియంత్రిత పరిశ్రమల న్యాయ సేవలు అందిస్తుందన్నారు. ఈ సేవలు సంస్థ యొక్క ప్రపంచవ్యాప్త నెట్‌వర్క్ ద్వారా బలపరచబడతాయని చెప్పారు. అదనంగా అహ్మదాబాద్, చెన్నై, వరంగల్లో సహకార కార్యాలయాలు ఉన్నాయి.

మల్కాజగిరి శాఖ సునీల్ అసోసియేట్స్ భాగస్వామ్యంతో, ఉత్తర-తూర్పు హైదరాబాద్ ప్రాంతంలో సంస్థ యొక్క ప్రాప్యతను, స్పందన వేగాన్ని మరింతగా విస్తరించింది.ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది సునీల్ సింధు, వినీల్, రవీంద్ర, శ్రీనివాస్, చైతన్య నిఖిల్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

రథసప్తమి రోజు చేయాల్సింది ఏమిటి?

Satyam News

పోలీసుల వేధింపులతో ఉర్దూ అకాడమీ ఉద్యోగి ఆత్మహత్య?

Satyam News

తెలంగాణ పోలీసులకు సీఎం రేవంత్ అభినందన

Satyam News

యుకె బిజినెస్ ఫోరం రోడ్ షోలో మంత్రి లోకేష్ బిజీ

Satyam News

రష్యా సైన్యంలోకి బలవంతంగా పంజాబ్ యువకులు

Satyam News

ఎర్ర చందనం స్మగ్లర్ల అరెస్టు

Satyam News

Leave a Comment