గుంటూరు హోమ్

CRDA బిల్డింగ్ రెడీ… ఇక రాజధాని నిర్మాణం పరుగులు….!!

#CRDA

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. రాష్ట్ర విభజన తర్వాత అర్ధాంతరంగా నిలిచిపోయిన రాజధాని నిర్మాణ కలలకు ఊపిరిపోస్తూ ఆంధ్రప్రదేశ్‌ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ – AP CRDA బిల్డింగ్ ప్రారంభోత్సవానికి రెడీ అయిపోయింది.

ఈ బిల్డింగ్ కేవలం ఆఫీసు మాత్రమే కాదు..అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా నిర్మించాలనే ఆశయానికి ఓ చిరునామా. 2014-19 మధ్య కాలంలోనే CRDA బిల్డింగ్ పనులకు శ్రీకారం చుట్టినప్పటికీ..2019లో అధికారంలోకి వచ్చిన జగన్ 3 రాజధానుల పేరుతో ఈ పనులను నిలిపివేశారు. ఐతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పనులపై ఫోకస్ పెట్టి వేగంగా పూర్తి చేసింది.

అమరావతి రాయపూడి ప్రాంతంలో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఈ బిల్డింగ్‌ను ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ బిల్డింగ్‌ను G+7 అంతస్తుల్లో దాదాపు 3.62 ఎకరాల్లో నిర్మించారు. ఈ భవనం దాదాపు 2 లక్షల 42 వేల చదరపు అడుగుల్లో విస్తరించి ఉంది.

ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్‌తో పాటు అధునాతన సౌకర్యాలతో అమరావతి అభివృద్ధికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఈ CRDA బిల్డింగ్ మారనుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలల వ్యవధిలోనే ఈ బిల్డింగ్‌ను నిర్మించారు. దాదాపు 500 మందికి పైగా కార్మికులు, ఇంజనీర్లు రేయింబవళ్లు శ్రమించి ఈ బిల్డింగ్‌ను పూర్తి చేశారు.

ఈ CRDA బిల్డింగ్‌లో పురపాలక శాఖ మంత్రి, CRDA కమిషనర్ల ఛాంబర్లతో పాటు పరిపాలన, ఇంజనీరింగ్, ప్రణాళికా విభాగాలు, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్  ఆఫీసులు ఉండనున్నాయి. ఈ కొత్త CRDA బిల్డింగ్‌లో ప్రతి అంతస్తులో అధికారుల కేబిన్‌లు, ఉద్యోగుల వర్క్‌స్టేషన్‌లు, కామన్ ఫెసిలిటీలు అలాగే అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్‌తో ప్రణాళికాబద్ధంగా నిర్మించారు.

అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులను రియల్-టైమ్‌లో మానిటర్ చేయడానికి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను నిర్మించారు. ఈ కంట్రోల్ రూమ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో నిర్మించారు. ఇది సీఆర్‌డీఏ, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టరేట్ వంటి విభాగాలకు కోఆర్డినేషన్ ప్లాట్‌ఫాంగా ఉపయోగపడుతుంది.

ఈ భవనంలో ఉద్యోగులు, ఇతర సిబ్బంది పనిచేసేందుకు ఎలక్ట్రికల్ ఫిటింగ్స్, ఇంటీరియర్ వర్క్‌లు, ల్యాండ్‌స్కేపింగ్, మోడరన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో పని చేసే వాతావరణాన్ని సిద్ధం చేశారు. ఈ బిల్డింగ్ పనులు పూర్తి కావడంతో మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. కొత్త ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలైందన్నారు.

4 రోజుల్లో APCRDA అమరావతిలో తన భవనాన్ని ప్రారంభిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచస్థాయి రాజధాని కావాలన్న కలకు ఈ ఆఫీసు ఇంధనంగా ఉపయోగపడుతుందన్నారు. ప్రజా రాజధాని భవిష్యత్తు రూపు దిద్దుకుంటోందంటూ లోకేష్ హర్షం వ్యక్తం చేశారు.

Related posts

రష్యా సైన్యంలోకి బలవంతంగా పంజాబ్ యువకులు

Satyam News

సనత్ నగర్‌లో రావణ దహనంలో పాల్గొన్న తలసాని

Satyam News

చంద్రబాబుకు షాక్ ఇచ్చిన క్రిమినల్స్!

Satyam News

Leave a Comment

error: Content is protected !!