విజయనగరంహోమ్

పండగ రోజున లాఠీకి పని చెప్పిన పోలీసులు.

విజయనగరం పోలీసులు దీపావళి పండగ రోజునే లాఠీకి పని చెప్పారు. అదీ రాత్రి ఎనిమిది తరువాత రోడ్లపై అటు వాహనదారులకు, ఇటు పబ్లిక్ కు ఇబ్బంది కలిగించేలా తారాజువ్వల పోటీలపై ఉక్కు పాదం మోపారు. విజయనగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధి అంబటి సత్రం, పుచ్చలవీధి, బుచ్చన్నకోనేరు, పాత బస్టాండ్, అద్దేపల్లి వారి వీధి, టెంపుల్ స్ట్రీట్ లలౌ సీఐ శ్రీనివాస్ క్రైమ్ పార్టీ సిబ్బంది రవి, కాశీ, ఎస్ఐ కృష్ణమూర్తి తో లాఠీలకు పని చెప్పారు.

నడిరోడ్ పై తారాజువ్వలను వెలిగించి పోటీలుగా కాల్చుతున్న యువతకు చిన్నపాటి క్లాస్ తీసుకున్నారు. పుచ్చలవీధికి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో కొంతమంది పొలిటికల్ నేతలు సీఐ శ్రీనివాస్ కు ఫోన్ చేసి వదిలేయండి సీఐ సార్ అంటూ ఫోన్లు చేయడం విశేషం. కానీ సీఐ శ్రీనివాస్.. యముడు సినిమా లో హీరో సూర్య లా లాఠీకి పని చెప్పి నిఖార్సైన పోలీస్ లా తన కర్తవ్యం నిర్వర్తించారు.

Related posts

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్టు

Satyam News

21 నెలల్లోనే 5.50 లక్షల ఇళ్లు..ఇది కూటమి రికార్డ్!

Satyam News

మళ్లీ మళ్లీ జగన్ క్రెడిట్‌ చోరీ….

Satyam News

గోడు వెళ్లబోసుకున్న ఆడబిడ్డలను కాపాడే బాధ్యత మాది

Satyam News

కాకినాడలో “స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర”

Satyam News

చింతాడ ఆనంద్ ఎస్సీ హోదాపై ఏం జరుగుతుంది?

Satyam News

Leave a Comment