26.3 C
Hyderabad
September 19, 2026
విజయనగరంహోమ్

పండగ రోజున లాఠీకి పని చెప్పిన పోలీసులు.

విజయనగరం పోలీసులు దీపావళి పండగ రోజునే లాఠీకి పని చెప్పారు. అదీ రాత్రి ఎనిమిది తరువాత రోడ్లపై అటు వాహనదారులకు, ఇటు పబ్లిక్ కు ఇబ్బంది కలిగించేలా తారాజువ్వల పోటీలపై ఉక్కు పాదం మోపారు. విజయనగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధి అంబటి సత్రం, పుచ్చలవీధి, బుచ్చన్నకోనేరు, పాత బస్టాండ్, అద్దేపల్లి వారి వీధి, టెంపుల్ స్ట్రీట్ లలౌ సీఐ శ్రీనివాస్ క్రైమ్ పార్టీ సిబ్బంది రవి, కాశీ, ఎస్ఐ కృష్ణమూర్తి తో లాఠీలకు పని చెప్పారు.

నడిరోడ్ పై తారాజువ్వలను వెలిగించి పోటీలుగా కాల్చుతున్న యువతకు చిన్నపాటి క్లాస్ తీసుకున్నారు. పుచ్చలవీధికి చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో కొంతమంది పొలిటికల్ నేతలు సీఐ శ్రీనివాస్ కు ఫోన్ చేసి వదిలేయండి సీఐ సార్ అంటూ ఫోన్లు చేయడం విశేషం. కానీ సీఐ శ్రీనివాస్.. యముడు సినిమా లో హీరో సూర్య లా లాఠీకి పని చెప్పి నిఖార్సైన పోలీస్ లా తన కర్తవ్యం నిర్వర్తించారు.

Related posts

కర్నాటకలో సోషల్ మీడియా పై నిషేధం

Satyam News

విశాఖలో మంత్రి నారా లోకేష్ 78వ ప్రజాదర్బార్

Satyam News

మదర్సా విద్యార్థులకు, మహిళలకు నూతన వస్త్రాల అందజేత

Satyam News

కోటకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

Satyam News

శాంతినగర్ పట్టణంలో అత్యంత వేడుకగా  శివలింగ ప్రతిష్ట.

Satyam News

మళ్లీ అమెరికా వెళుతున్న కవిత

Satyam News

Leave a Comment