అనంతపురం హోమ్

బీసీ యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యం

#Savita

వెనుకబడిన తరగతులకు గౌరవ ప్రదమైన జీవనంతో పాటు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. బీసీ యువతకు ప్రభుత్వ నిర్వహణలో భాగస్వామ్యం కల్పిస్తూ అధిక ఉద్యోగాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామన్నారు.

బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాల అందించడమే తమ కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. న్యూఢిల్లీలోని ఓక్ హాల్ లో శనివారం జరిగిన స్కోచ్ అవార్డుల ప్రధానోత్సవంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. పోటీ పరీక్షల్లో బీసీ నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందజేసినందుకు గానూ సోషల్ జస్టిస్ సెక్యూరిటీ విభాగంలో బంగారు స్కోచ్ అవార్డు వరించింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బీసీల అభివృద్ధే లక్ష్యంగా టీడీపీ ఆవిర్భవించిందన్నారు. అన్న ఎన్టీఆర్ వెనుకబడిన తరగతులను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రోత్సాహించారన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు బీసీలను రాజ్యాధికారంలో భాగస్వాములను చేశారు. అభివృద్ధి అట్టడుగు వర్గాలకు తీసుకెళ్లినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధాని నరేంద్రమోడి భావిస్తున్నారన్నారు.

ప్రధాని నరేంద్రమోడి, సీఎం చంద్రబాబు నాయుడు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో బీసీ నిరుద్యోగ యువతకు బీసీ సంక్షేమ శాఖ వివిధ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందజేశామన్నారు. బీసీ స్టడీ సర్కిళ్ల ఆధ్వర్యంలో మెగా డీస్సీకి ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందజేశామన్నారు.

అన్ని జిల్లా కేంద్రాల్లోనూ బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా నిర్వహించిన శిక్షణా కేంద్రాల్లో 1,674 మందికి, ఆన్ లైన్ ద్వారా మరో 4,774 మందికి ఇలా మొత్తం 6,470 మందికి ఉచిత శిక్షణ అందజేశామన్నారు. ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో శిక్షణ పొందిన వారిలో 246 మంది బీసీ అభ్యర్థులు టీచర్లగా ఎంపికయ్యారన్నారు. విజయవాడలోని బీసీ స్టడీ సర్కిల్ ద్వారా 83 మందికి సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ అందజేయగా, వారిలో గ్రూప్ 2 మెయిన్స్ కు 12 మంది, ఆర్.ఆర్.బి లెవల్ – 1కు పది మంది ఎంపికయ్యారన్నారు.

ఎఫ్.ఆర్.వో ప్రిలిమ్స్ కు ఇద్దరు, మెయిన్ కు ఒకరు అర్హత సాధించారన్నారు. పోలీసు కానిస్టేబుల్  ఉద్యోగాలకు మరో మరో ఆరుగురు, ఆర్.ఆర్.బి లోకో పైలట్ గా మరో అభ్యర్థి ఎంపికయ్యారన్నారు. మరికొన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు మరికొందరు అర్హత సాధించారన్నారు. బీసీ నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల్లో ఉచిత శిక్షణ అందజేసినందుకు గాను ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు బీసీ సంక్షేమ శాఖకు ప్రకటించడంపై మంత్రి సవిత ఆనందం వ్యక్తంచేశారు.

అవార్డు స్ఫూర్తితో మరింత ఉత్సాహంగా పనిచేస్తామన్నారు. రాబోయే కాలంలో బీసీ యువతకు అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందివ్వనున్నామన్నారు. అమరావతిలో అయిదెకరాల్లో బీసీ స్టడీ సర్కిల్ నిర్మించనున్నామన్నారు. విశాఖ, రాజమండ్రి, తిరుపతి, అనంతపురంలో మెగా బీసీ స్టడీ సర్కిళ్లను నిర్మించే ఆలోచన ఉందన్నారు.

అంతకుముందు స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చార్, ప్రొఫెసర్ మహేందర్ దేవ్ చేతుల మీదుగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అవార్డు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related posts

జగన్‌ చెవులు దద్దరిల్లేలా విజయవాడ ఉత్సవ్‌

Satyam News

మద్యం మత్తులో కారు పైకి బైక్‌తో దూసుకెళ్లిన యువకుడు

Satyam News

ఎర్ర చందనం స్మగ్లర్ల వేట

Satyam News

Leave a Comment

error: Content is protected !!