ముఖ్యంశాలుహోమ్

ఎర్ర చందనం స్మగ్లర్ల వేట

కడప జిల్లా లో ఎర్ర చందనం స్మగ్లర్ల వేట కొనసాగుతున్నది. తాజాగా కరుడుగట్టిన ఎర్రచందనం స్మగ్లర్ నాగ దస్తగిరి రెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేశారు. చాపాడు పోలీసులు జిల్లాలో అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. దస్తగిరి రెడ్డి పై రెండు సార్లు పిడి యాక్టు తో పాటు 86 ఎర్రచందనం రవాణా కేసులతో పాటు 34 దొంగతనం కేసులు ఉన్నట్లు విచారణలో వెల్లడి అయింది. ఇతనితో పాటు మరో 5 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 1 టన్ను బరువుగల 52 ఎర్రచందనం దుంగలు, రవాణాను ఉపయోగించిన 2 కార్లు, 1 బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా కు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరిక జారీ చేశారు. ఈ వివరాలు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు.

Related posts

ప్రముఖ సినీ నటి పావలా శ్యామల కన్నుమూత

Satyam News

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు

Satyam News

కృత్రిమ గర్భనిరోధక పద్ధతులపై విముఖత

Satyam News

దేశ భద్రతలో పుట్టపర్తి ఏరోస్పేస్ క్లస్టర్ ప్రాముఖ్యత ఏమిటి?

Satyam News

స‌ర్ విజ్జీ స్టేడియంను ప‌రిశీలించిన గోవా గ‌వ‌ర్న‌ర్

Satyam News

దర్శకుడు పి సి ఆదిత్య కు శ్రీకృష్ణదేవరాయలు స్మారక పురస్కారం

Satyam News

Leave a Comment