26.3 C
Hyderabad
September 19, 2026
ముఖ్యంశాలుహోమ్

ఎర్ర చందనం స్మగ్లర్ల వేట

కడప జిల్లా లో ఎర్ర చందనం స్మగ్లర్ల వేట కొనసాగుతున్నది. తాజాగా కరుడుగట్టిన ఎర్రచందనం స్మగ్లర్ నాగ దస్తగిరి రెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేశారు. చాపాడు పోలీసులు జిల్లాలో అక్రమంగా ఎర్రచందనం రవాణా చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. దస్తగిరి రెడ్డి పై రెండు సార్లు పిడి యాక్టు తో పాటు 86 ఎర్రచందనం రవాణా కేసులతో పాటు 34 దొంగతనం కేసులు ఉన్నట్లు విచారణలో వెల్లడి అయింది. ఇతనితో పాటు మరో 5 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 1 టన్ను బరువుగల 52 ఎర్రచందనం దుంగలు, రవాణాను ఉపయోగించిన 2 కార్లు, 1 బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా కు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరిక జారీ చేశారు. ఈ వివరాలు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వెల్లడించారు.

Related posts

జర్నలిస్టుల ఐక్యతతోనే సమస్యలు పరిష్కారం

Satyam News

ముగ్గురు రౌడీషీటర్లకు జిల్లా బహిష్కరణ

Satyam News

ఉత్తర తెలంగాణ ను ముంచేసిన వాన

Satyam News

హెచ్‌ఎస్‌బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ జట్ల ఖరారు

Satyam News

అవసరం లో ఉన్న వైసీపీ కార్యకర్త ను ఆదుకున్న మంత్రి లోకేష్

Satyam News

త్రిమూర్తుల కలయిక వల్లే రాష్ట్రం అభివృద్ధి

Satyam News

Leave a Comment