వనపర్తి జిల్లా పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో పనిచేస్తున్న డీ.ఎం. జగన్మోహన్ రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఓ మిల్లుకు సీఎంఆర్ పర్మిషన్ ఇవ్వడానికి రూ. ఒక లక్ష డెబ్బై వేలు డిమాండ్ చేశాడు.
బాధితుడుతో రూ. 50 వేలకు బేరం కుదరడంతో ఒప్పందంలో భాగంగా వనపర్తిలోని తన కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తూ తన కారులో రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. నిందితుడిని శుక్రవారం నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ఏసీబీ డిఎస్పి తెలిపారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితె ట్విట్టర్(ఎక్స్), వాట్సాప్, పేస్ బుక్ ద్వారా పిర్యాదు చేయాలని డిఎస్పీ ప్రజలను కోరారు. పిర్యాదు చేసిన వారి వివరాలు గొప్యంగా ఉంచుతామని చెప్పారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్
