ఆధ్యాత్మికంహోమ్

రూ. 347 కోట్లతో జోగులాంబ దేవాలయ అభివృద్ధి

#jogulambatemple

తుంగభద్ర నది ఒడ్డున ఆలంపూర్ వద్ద కొలువైన 5వ శక్తి పీఠం జోగులాంబ అమ్మ వారి ఆలయ అభివృద్ధికి రూ. 347 కోట్లతో ప్రణాళికను సిద్ధం చేశారు. తక్షణం బాలాలయం, వజ్ర లేపనం, కుంబాభిషేకం వంటి పనులు ప్రారంభించేందుకు రూ. 35 కోట్లు అవసరం అని నిర్ణయం తీసుకున్నారు. సచివాలయంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, స్తపతి గోవింద హరి, ఆలయ అభివృద్ధి రూపశిల్పి సూర్యనారాయణ మూర్తి జోగులాంబ ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు.

త్వరలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం కావాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జోగులాంబ ఆలయాన్ని గొప్పగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యం సీఎం రేవంత్ రెడ్డికి ఉందని, ఈ ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం సకల సౌకర్యాలు కల్పించాలన్న తపన సీఎం కు ఉందని చిన్నారెడ్డి తెలిపారు. రూ. 347 కోట్ల ప్రణాళికలో మొదటి దశలో రూ. 138.40 కోట్లు, రెండవ దశలో రూ. 117.60 కోట్లు, మూడవ దశలో రూ. 91 కోట్లు అవసరం అని సమావేశంలో నిర్ణయానికి వచ్చారు.

Related posts

రౌడీషీటరు ప్రియుడు తో కలిసి భర్త కు స్పాట్

Satyam News

లక్షలాది రూపాయల దుర్వినియోగంపై సీఎంకు ఫిర్యాదు

Satyam News

చీకటి పొత్తులకు బ్రాండ్ అంబాసిడర్ జగన్

Satyam News

ముగ్గురు అమ్మాయిలు ఆంధ్రా పేరును నిలబెట్టారు!

Satyam News

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి విజయవంతంగా శస్త్ర చికిత్స

Satyam News

కాక్రోచ్ నిరసన: చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఉపేక్షించవద్దు

Satyam News

Leave a Comment