తూర్పుగోదావరిహోమ్

కాకినాడ ప్రాంతంలో ముమ్మరంగా సహాయక చర్యలు

#Kakinada

మొంథా తుఫాను నేపథ్యంలో మంగళవారం కాకినాడ పట్టణం ఏటిమోగా, దుమ్ములుపేట, తాళ్ళరేవు మండలం గాడిమోగ ఇతర ప్రాంతాల్లో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ బిందు మాధవ్, ఎంపీ సానా సతీష్ బాబు, కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు కాకినాడ పట్టణం ఏటిమోగ, తూర్పుపాక ప్రాంతాన్ని పరిశీలించారు.

పునరావస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, అధికారులతో సహకరించి, ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అధికారులు, ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. కాకినాడ పట్టణంలో పునరావాసక కేంద్రాలకు తరలించిన ప్రజల కోసం కాకినాడ సూర్యకళామందిరం ప్రక్కన సిద్ధం చేసిన భోజన పదార్థాలను జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ప్రజాప్రతినిధులు పరిశీలించారు.

పునరావాస కేంద్రాల్లోని ప్రజలకు నాణ్యమైన రుచికరమైన భోజనాన్ని సకాలంలో అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. కాకినాడ పట్టణం దుమ్ములుపేటలోని తుఫాను ప్రభావిత ప్రాంత ప్రజల కోసం పరల్వపేట ఏఎంజీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ప్రజలకు స్వయంగా మధ్యాహ్నం భోజనం వడ్డించారు.

Related posts

అంబేద్కర్ కి అవమానం చేసిన వారిపై కఠిన చర్యలు

Satyam News

సరస్వతి దేవాలయంలో అష్టాదశ శక్తి పీఠాల విగ్రహాల ప్రతిష్ట

Satyam News

రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యం

Satyam News

సత్తిబాబు చర్యలతో జగన్ గుండెల్లో గుబులు

Satyam News

అంగరంగ వైభవంగా భీమవరం టాకీస్ 15 చిత్రాలు ప్రారంభం

Satyam News

₹ 1.14 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

Satyam News

Leave a Comment