ఆధ్యాత్మికంహోమ్

సరస్వతి దేవాలయంలో అష్టాదశ శక్తి పీఠాల విగ్రహాల ప్రతిష్ట

పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఉప్పలపాడు గ్రామ సమీపంలో వెలసిన సరస్వతి దేవాలయంలో గురువారం అష్టాదశ శక్తి పీఠాల వాయు ప్రతిష్టా కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆమె అర్చకులు ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, మండపారాధన, అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వేద పండితుల ఆధ్వర్యంలో చండీయాగం, పూర్ణాహుతి చేపట్టారు. జ్ఞాన సరస్వతి దేవాలయంలో లక్ష్మీ గణపతి, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అభయాంజనేయ స్వామి, మహంకాళి, మహాకాళేశ్వరుడు, మహాలక్ష్మి,జ్ఞాన సరస్వతి దేవి, 11 అడుగుల విష్ణుమూర్తి ఉప ఆలయాలు ఉన్నట్లు ఆలయ చైర్మన్ అన్నపూర్ణయ సిద్ధాంతి తెలియజేశారు.

అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ కంజుల జగన్మోహన్ రెడ్డి, సెక్రటరీ గుంటూరు సీతారామాంజనేయులు, కోశాధికారి ఆదినారాయణ, హనుమంతరావు ఇతర కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అష్టాదశ శక్తిపీఠాల వాయు ప్రతిష్ట మహోత్సవాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

మార్చి 19న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న దురంధర్ 2

Satyam News

‘ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి’ వెబ్‌సైట్ ఆవిష్కరణ

Satyam News

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు క్షేత్రస్థాయిలో ప్రణాళికలు

Satyam News

మహిళా బిల్లును అడ్డుకోవటం ప్రజాస్వామ్య చరిత్రలో బ్లాక్ డే

Satyam News

మహిళా డాక్టర్ కు లైంగిక వేధింపులు: ఆత్మహత్య

Satyam News

నేపాల్ నుంచి భారత్ కు ప్రత్యేక విమానాలు

Satyam News

Leave a Comment