26.3 C
Hyderabad
September 19, 2026
ప్రకాశంహోమ్

అంబేద్కర్ కి అవమానం చేసిన వారిపై కఠిన చర్యలు

రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్ అంబేద్కర్ కి అవమానం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి హెచ్చరించారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పంలో అంబేడ్కర్ విగ్రహానికి మంటలు అంటుకున్న ఘటనను మంత్రి స్వామి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా శుక్రవారం నాడు వెలగపూడి సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ……ఈ ఘటన జరగడం దురదృష్టకరం, జిల్లా ఎస్పీ, కలెక్టర్ ఇప్పటికే సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. దోషులు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదు, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కి అవమానం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు. ఈ రోజు సాయంత్రం లోపు కొత్త అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ విషయంపై విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎవరూ మాట్లాడొద్దు. జాతీయ నేతల విగ్రహాలకు అవమానం కలిగించేలా వ్యవహరిస్తే సహించేది లేదని వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.

Related posts

భారత్ పరువు తీసిన గాల్గోటియాస్ యూనివర్సిటీ

Satyam News

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ కుటుంబంలో మరో పదవి

Satyam News

దూసుకువస్తున్న సేన్యార్ తుఫాన్

Satyam News

కత్వ చెరువు రిపేర్లు వెంటనే మొదలు పెట్టాలి

Satyam News

‘ప్రభుత్వ సారాయి దుకాణం’ చిత్ర టీజర్ లాంచ్

Satyam News

ఆశ్రమంలో అపర వాల్మీకి జయంతి వేడుకలు

Satyam News

Leave a Comment