మహబూబ్ నగర్హోమ్

ఆన్ లైన్ బెట్టింగ్ ల కోసం మర్డర్… దారుణం

#GadwalaPolice

ఆన్ లైన్ బెట్టింగ్ లకు బానిసై, అక్రమ మార్గాన డబ్బులు సంపాదించాలనే అత్యాశతో ఓ మహిళను హత్య చేసి, బంగారు పుస్తెలతాడు, ఆభరణాలు,పట్టీలు, కడాలు, ఎత్తుకెళ్లిన కేసులో ప్రధాన నిందుతుడిని గద్వాల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుడి నుంచి రూ.2,35,000, ఒక వాహనం, ఐపోన్ స్వాధీనం చేసుకున్నారు. గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శేరెల్లివీధిలో బలిజ లక్ష్మీ‌ (55)హత్య కేసులో ప్రధాన నిందితుడు రాంరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ టి.శ్రీనివాస్ రావు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో  గద్వాల ఏఎస్పీ శంకర్, డీఎస్పి వై మొగులయ్య గద్వాల్ సీఐ టి.శ్రీను, గద్వాల రూరల్ ఎస్ఐ శ్రీకాంత్, మల్దకల్ ఎస్ఐ  నందీకర్, ధరూర్ ఎస్ఐ శ్రీహరి , గద్వాల టౌన్ 2 ఎసై సతీష్ రెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

శృంగారంపై సమంత వ్యాఖ్యలు వైరల్ !

Satyam News

టీ 20 ప్రపంచ కప్ నుంచి పాకిస్థాన్ ఔట్

Satyam News

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదుల స్వీకరణ

Satyam News

రూ 4.82 కోట్ల విలువైన చైనా బాణసంచా పట్టివేత

Satyam News

20న క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇండ్లకు శ్రీకారం

Satyam News

రైతు బాధలు వింటే కడుపు తరుక్కపోతోంది

Satyam News

Leave a Comment