మహబూబ్ నగర్హోమ్

ఆన్ లైన్ బెట్టింగ్ ల కోసం మర్డర్… దారుణం

#GadwalaPolice

ఆన్ లైన్ బెట్టింగ్ లకు బానిసై, అక్రమ మార్గాన డబ్బులు సంపాదించాలనే అత్యాశతో ఓ మహిళను హత్య చేసి, బంగారు పుస్తెలతాడు, ఆభరణాలు,పట్టీలు, కడాలు, ఎత్తుకెళ్లిన కేసులో ప్రధాన నిందుతుడిని గద్వాల పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుడి నుంచి రూ.2,35,000, ఒక వాహనం, ఐపోన్ స్వాధీనం చేసుకున్నారు. గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శేరెల్లివీధిలో బలిజ లక్ష్మీ‌ (55)హత్య కేసులో ప్రధాన నిందితుడు రాంరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ టి.శ్రీనివాస్ రావు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో  గద్వాల ఏఎస్పీ శంకర్, డీఎస్పి వై మొగులయ్య గద్వాల్ సీఐ టి.శ్రీను, గద్వాల రూరల్ ఎస్ఐ శ్రీకాంత్, మల్దకల్ ఎస్ఐ  నందీకర్, ధరూర్ ఎస్ఐ శ్రీహరి , గద్వాల టౌన్ 2 ఎసై సతీష్ రెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

రామతీర్థంలో శివరాత్రి ఏర్పాట్ల పై సమీక్ష

Satyam News

అన్యాయమైన డిమాండ్లు లేకపోతే చర్చలకు మళ్లీ సిద్ధం

Satyam News

రూ.20 వేల కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం

Satyam News

కొత్త ఎజెండా తో ప్రజల ముందుకు కేసిఆర్

Satyam News

ఇక నుంచి శ్రీవారి భక్తులకు ‘రీ-ఎంట్రీ’ సదుపాయం

Satyam News

రోడ్డు ప్రమాదంలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ చౌదరి మృతి

Satyam News

Leave a Comment