కడపహోమ్

వైభవంగా శ్రీ మాధవరాయ మహోత్సవం

కడప జిల్లా మైదుకూరులో వెలసిన భూదేవి శ్రీదేవి సమేత శ్రీ లక్ష్మీ మాధవరాయ స్వామి ఊరేగింపు మహోత్సవం అంగరంగ వైభవం గా జరిగింది.

అత్యంత వైభవంగా మీరుమిట్లు గోలిపే టపాసుల తారాజువ్వలు పండుగ వాతావరణం లో సంక్రాంతి మూడవ రోజు అయిన కనుమ పండుగ నాడు అశేష జన సందోహం మధ్య స్వామి వారి పల్లకి ఊరేగింపు మహోత్సవం నిర్వహించారు.

కోలాటం, కేరళ వాయిద్యాలతో, చిలక వేశాధారణలో నృత్యంలు ప్రజలను ఆకర్శించే విధంగా కార్యక్రమాలు జరిగాయి. ఈ మాధవరాయ స్వామి సంక్రాంతికి పారువేటగా బయలుదేరి మైదుకూరు చుట్టుపక్కల 16 గ్రామాలలో అంగరంగ వైభవంగా ఊరేగింపబడతారు.

ప్రతి గ్రామానికి వెళ్లిన రోజు మాధవరాయ స్వామికి వైభవంగా పూజలు చేసి ఊరేగింపు చేపట్టి ఆ గ్రామంలో ఆ రోజును పండుగగా గ్రామప్రజలు చేసుకుంటారు. ఇది అనేక తరాలుగా ఆనవాయితీగా వస్తుంది.

Related posts

కళ్యాణదుర్గం వైకాపా ‘కుబేరుడు’… ఒక ఫోటోషాప్!

Satyam News

రేవంత్ ప్రభుత్వ పాలసీలు తుగ్లక్ పాలసీలు

Satyam News

ఏపీకి కేంద్రం భారీ గ్రాంట్‌… పంచాయితీలకు పండగ

Satyam News

హైదరాబాద్‌లో భక్తి వైభవంగా శ్రీ వేంకటేశ్వరస్వామి వారి రథోత్సవం

Satyam News

గోదావరి పుష్కరాలపై అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి

Satyam News

ఇద్దరు అగ్ర మావోయిస్టుల లొంగుబాటు

Satyam News

Leave a Comment