కడపహోమ్

వైభవంగా శ్రీ మాధవరాయ మహోత్సవం

కడప జిల్లా మైదుకూరులో వెలసిన భూదేవి శ్రీదేవి సమేత శ్రీ లక్ష్మీ మాధవరాయ స్వామి ఊరేగింపు మహోత్సవం అంగరంగ వైభవం గా జరిగింది.

అత్యంత వైభవంగా మీరుమిట్లు గోలిపే టపాసుల తారాజువ్వలు పండుగ వాతావరణం లో సంక్రాంతి మూడవ రోజు అయిన కనుమ పండుగ నాడు అశేష జన సందోహం మధ్య స్వామి వారి పల్లకి ఊరేగింపు మహోత్సవం నిర్వహించారు.

కోలాటం, కేరళ వాయిద్యాలతో, చిలక వేశాధారణలో నృత్యంలు ప్రజలను ఆకర్శించే విధంగా కార్యక్రమాలు జరిగాయి. ఈ మాధవరాయ స్వామి సంక్రాంతికి పారువేటగా బయలుదేరి మైదుకూరు చుట్టుపక్కల 16 గ్రామాలలో అంగరంగ వైభవంగా ఊరేగింపబడతారు.

ప్రతి గ్రామానికి వెళ్లిన రోజు మాధవరాయ స్వామికి వైభవంగా పూజలు చేసి ఊరేగింపు చేపట్టి ఆ గ్రామంలో ఆ రోజును పండుగగా గ్రామప్రజలు చేసుకుంటారు. ఇది అనేక తరాలుగా ఆనవాయితీగా వస్తుంది.

Related posts

లోక్ సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం

Satyam News

బీఆర్ఎస్‌ను తరిమికొట్టండి: సీఎం రేవంత్ రెడ్డి

Satyam News

ఏపీ లిక్కర్ స్కామ్: ఐటి దాడులు

Satyam News

అన్ని జిల్లాల్లో ఘనంగా విశ్వకర్మ జయంతి

Satyam News

తల్లి కాబోతున్న కత్రినా కైఫ్

Satyam News

శ్రీశ్రీశ్రీ పైడిత‌ల్లి జాత‌ర‌కు ఉగ్రవాదుల ముప్పు?

Satyam News

Leave a Comment