ప్రత్యేకంహోమ్

కూటమికి తిరుగులేదు జగన్ పార్టీకి బతుకులేదు

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, సీఓటర్ (CVoter) వ్యవస్థాపకుడు యశ్వంత్ దేశ్‌ముఖ్ మరియు సీనియర్ జర్నలిస్ట్ బర్ఖా దత్ మధ్య జరిగిన తాజా చర్చలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు వెలువడ్డాయి.

ప్రస్తుతం ఏపీలో అధికార కూటమి (TDP-JSP-BJP) బలం గణనీయంగా పెరిగిందని, ప్రత్యర్థుల కంటే దాదాపు 20 శాతం ఓట్ షేర్ ఆధిక్యంలో ఉందని యశ్వంత్ దేశ్‌ముఖ్ వెల్లడించారు.
ముఖ్యంగా నారా లోకేష్‌లో వచ్చిన మార్పును ఆయన ఒక గొప్ప ‘కేస్ స్టడీ’గా అభివర్ణించారు.

రెండు ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సమయంలో రాజకీయ చిత్రపటంలో లోకేష్ ప్రభావం అంతగా లేదని, కానీ ఇప్పుడు ఆయన అద్భుతమైన మార్పును కనబరిచారని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి అభ్యర్థిత్వ రేటింగ్స్‌లో లోకేష్ దాదాపు టీడీపీ ఓట్ బేస్‌ను తన వైపుకు తిప్పుకున్నారని, జనాదరణలో తన తండ్రి కంటే కేవలం 10 శాతం మాత్రమే తక్కువ రేటింగ్‌లో ఉన్నారని విశ్లేషించారు.
జాతీయ స్థాయిలో ముఖ్యమంత్రుల పనితీరుపై జరిగిన సర్వేలో చంద్రబాబు నాయుడు నంబర్ వన్ స్థానంలో నిలిచారని, ఆయన రేటింగ్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సమానంగా ఉందని దేశ్‌ముఖ్ తెలిపారు.

చంద్రబాబు నాయుడి అనుభవం, పవన్ కళ్యాణ్ కు ఉన్న ప్రజాకర్షణ కలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో కూటమికి తిరుగులేదని ఆయన అంచనా వేశారు. పార్టీలో వారసత్వ క్రమం కూడా చాలా స్పష్టంగా ఉందని, నారా లోకేష్ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా చక్కగా రాణిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు.

Related posts

గోదావరి పుష్కరాల నాటికి భద్రాద్రి వైభవం!

Satyam News

యూరియా కొరతకు కారణం ఏమిటి

Satyam News

సిసి రోడ్డు పనులను ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్

Satyam News

మా హాస్టల్ అధ్వాన్నం: మంచిర్యాల విద్యార్థుల ధర్నా

Satyam News

ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక గ్రామ సభకు సీఎస్

Satyam News

పార్టీ జెండా గద్దె నమూనా ఆవిష్కరించిన కవిత

Satyam News

Leave a Comment