25.2 C
Hyderabad
September 20, 2026
గుంటూరుహోమ్

శాంతి భద్రతలే పెట్టుబడులకు పునాది

#Chandra

మంగళగిరి 6వ బెటాలియన్ పోలీసు క్యాంపస్ లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని పోలీసుల సేవలను ప్రశంసించారు. సంస్మరణ సభలో చంద్రబాబు మాట్లాడుతూ పోలీసులు ప్రజల రక్షణ కోసం ప్రాణాలని సైతం పణంగా పెట్టే వీరులంటూ వారికి నివాళులు అర్పించారు.

వారి ఆత్మలకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థించినట్లు చెప్పారు. ఈ సంవత్సరం విధినిర్వహణలో 192 మంది పోలీసులు అమరులయ్యారని పేర్కొన్న ముఖ్యమంత్రి, వీరికి ఆయన గాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. “మీరు చేసేది కేవలం ఉద్యోగం కాదు నిస్వార్థ సేవ” అని పేర్కొన్నారు. పోలీసుల కుటుంబాలకు వారి త్యాగాలకు నమస్కారాలు తెలిపారు.

రాష్ట్రంలో శాంతి, స్థిరత్వం కోసం తీసుకుంటున్న చర్యల గురించి వివరిస్తూ ‘‘శాంతి భద్రతలే పెట్టుబడులకు పునాది అని అన్నారు. అందుకే లా అండ్ ఆర్డర్‌పై ఖచ్చితంగా ఉండటం అవసరమని స్పష్టం చేశారు. పెట్టుబడులకి భద్రత ఉండాలని, దీంతోనే మరిన్ని పెద్ద పెట్టుబడులు వస్తాయని ఆయన చెప్పారు.

ఉదాహరణకు గూగుల్ సంస్థ ఇక్కడకు వచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. నేరాలు రూపం మార్చుకుంటున్న నేపథ్యంలో పోలీసుల పని కూడా సాంకేతికంగా బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. సీసీ టీవీ కెమెరాలు, డ్రోన్లు, ఫోన్ సిగ్నల్స్, గూగుల్ టేకవుట్లు వంటి టెక్నాలజీ వినియోగంతో నేరస్తులను ఏకంగా గుర్తించి పట్టుకొని న్యాయస్థానానికి తీసుకెళ్లవచ్చని అన్నారు.

డ్రోన్ల సహాయంతో గంజాయి పంటలను గుర్తించి ధ్వంసం చేయడం, ఎర్ర చందనం దొంగలను అదుపులోకి తీసుకోవడం వంటి పనులను చెప్పి పోలీసులు సాంకేతికంగా ముందుండాలని కోరారు. నక్సలిజం, ఫ్యాక్షనిజం, రౌడీయిజం అణచివేతలో ఆంధ్రప్రదేశ్ పోలీసులకు చాలా పాత్ర ఉందని కొనియాడారు.

“నేరస్తులు ఇంటెలిజెంట్ క్రైమ్ చేస్తున్నారు. వారి కంటే ఒక అడుగు ముందుండాల్సి ఉంటుంది” అని ఆయన సూచించారు. రాజకీయ ముసుగులో జరిగే నేరాలు, తప్పుడు ప్రచారాలపై కూడా ఆయన హెచ్చరించి, అవి సమాజంలో చిచ్చు రేపే ప్రమాదకరమైన కార్యక్రమాలేనని అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా పోలీసులకు ఒక పెద్ద ఛాలెంజ్‌గా మారిందని ప్రత్యేకంగా చెప్పారు.

అసభ్యకర పోస్ట్‌లు, వ్యక్తిగత హననాలకు సంబంధించి బాధితులు బాధ పడుతున్నారు అని అన్నారు. శాంతి భద్రతలకంటే ఏదీ ముఖ్యం కాదన్నట్టు, ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరిగితే పోలీసులు కఠినంగా వ్యవహరించాలని మరియు ప్రజలకు పోలీసులు అండగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Related posts

19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలు ప్రారంభం

Satyam News

పర్యాటక రంగం అభివృద్ధితో మరింత గుర్తింపు

Satyam News

ఘనంగా వనపర్తి జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రమాణ స్వీకారం

Satyam News

అమెరికా నిర్ణయం పై అడ్డంతిరిగిన సౌదీ అరేబియా

Satyam News

వెనిజులా పై అమెరికా చర్యల్లో మరో కోణం…..

Satyam News

సంపూర్ణ చంద్రగ్రహణం ఇప్పుడు పరిపూర్ణం

Satyam News

Leave a Comment