ఆషాడ పౌర్ణమి గురు పౌర్ణమి ముందు రోజు ఆగస్టు 28 శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి కొలువై ఉన్న సింహగిరి చుట్టూ సుమారు 32 కిలోమీటర్లు గిరిప్రదక్షిణ చేసే భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవస్థానం చేస్తున్న ఏర్పాటులను విశాఖ జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ పోలీస్ కమిషనర్ దేవస్థానం ఈవో పరిశీలించారు.
స్వామి వారి తొలిపావంచ వద్ద భక్తులు కొబ్బరికాయ కొట్టి నడక ప్రారంభించే ప్రదేశాన్ని దేవస్థానం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ సుమారు 32 కిలోమీటర్ల వరకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మంచినీరు సదుపాయం మరుగుదొడ్లు వైద్య సదుపాయం అలాగే ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పరివేక్షణలో పోలీసులు నిఘా ఉంటుందని అన్నారు.
