ముఖ్యంశాలుహోమ్

అరకు లోయ లో కనిపించిన భూమి

#Earthquake

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆదివారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అరకులోయతో పాటు పాడేరు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. ఉదయం 11:31 గంటల సమయంలో సుమారు 8 సెకన్ల పాటు భూమి కంపించడంతో ఇళ్లలోని సామాగ్రి కదిలిపోయాయి. దీంతో ఏం జరుగుతుందో అర్థం కాక జనం హాహాకారాలు చేస్తూ ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు.

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ అందించిన వివరాల ప్రకారం, ఈ భూకంప కేంద్రం పొరుగు రాష్ట్రమైన ఒరిస్సాలోని కోరాపుట్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.4గా నమోదైంది. అరకు, పాడేరు ప్రాంతాలు ఒరిస్సా సరిహద్దులకు సమీపంలో ఉండటంతో ఇక్కడ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతానికి ఈ ప్రకంపనల వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం అందలేదు. ఒక్కసారిగా భూమి కంపించడంతో గిరిజన ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనల మధ్య గడుపుతున్నారు.

Related posts

ఏడు నెలల గర్భిణి, భర్త ఆత్మహత్య

Satyam News

ఇరాన్ పై మళ్లీ దాడి చేసిన అమెరికా

Satyam News

చంద్రబాబు..  ది టార్చ్‌బేరర్‌.. నాడు మైక్రోసాఫ్ట్‌…నేడు గూగుల్‌!

Satyam News

చెప్పులు ధరించి శ్రీవారి ఫోటో…. బొత్స ప్లాన్‌ బూమరాంగ్‌… వైసీపీ సెల్ఫ్‌ గోల్….!!

Satyam News

వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు డిగ్రీ కళాశాల

Satyam News

ఆడపిల్లకు జరిగిన అన్యాయంపై అడిగితే అక్రమ కేసులు

Satyam News

Leave a Comment