ముఖ్యంశాలుహోమ్

ముడి పొగాకుపై జీఎస్టీ 40 శాతం నుంచి 28 శాతానికి తగ్గించాలి

#NirmalaSitaraman

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, సహచర మంత్రులు, ఎంపీలతో కలసి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ని పార్లమెంట్ లో కలిసి ముడి పొగాకు (HSN 2401)పై ప్రస్తుతం అమలులో ఉన్న 40 శాతం జీఎస్టీని 28 శాతానికి తగ్గించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

రాష్ట్రంలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లి, రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇది కేవలం ముడి పొగాకు (HSN 2401)కు సంబంధించిన అంశమని, తయారైన పొగాకు ఉత్పత్తులకు దీనికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

జీఎస్టీ పెంపు కారణంగా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న FCV పొగాకు విలువపై తీవ్ర ప్రభావం పడుతున్న నేపథ్యంలో, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జీఎస్టీని 40 శాతం నుంచి 28 శాతానికి తగ్గించాలని కోరారు. ఈ నిర్ణయం ద్వారా పొగాకు రైతులు, డీలర్లు, ఎగుమతిదారులకు ఉపశమనం లభించడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో భారత పొగాకు ఎగుమతుల పోటీతత్వం మరింత మెరుగుపడుతుందని తెలిపారు.

ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, త్వరితగతిన తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు, ఎంపీలు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఈ కీలక సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి  కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస రాజు, ఇంధన శాఖ మంత్రి  గొట్టిపాటి రవి కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి, లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బస్తీపాటి నాగరాజు, బీద మస్తానీ రావు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

థాయ్‌లాండ్–హైదరాబాద్ డ్రగ్స్ లింక్ బట్టబయలు

Satyam News

అమరావతిలో చారిత్రక ఘట్టం..ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటుకు అడుగు.!

Satyam News

‘కలలకు రెక్కలు’ పథకంతో విదేశీ విద్యకు సహకారం

Satyam News

సంచలన నిర్ణయం తీసుకున్న తమిళనాడు దళపతి

Satyam News

రాజాం జీఎంఆర్ ఇలాకా లో రెండు చోట్ల భారీ చోరీలు

Satyam News

మోహన్ భాగవత్ పై కాంగ్రెస్ ఘాటు విమర్శ

Satyam News

Leave a Comment