ప్రకాశంహోమ్

భార్యపై భర్త అమానుష దాడి

తర్లపాడు మండలం కలుజువ్వలపాడు గ్రామం ఎస్టి కాలనీ చెందిన గురునాథం భాగ్యలక్ష్మి అనే మహిళపై భర్త బాలాజీ దాడి చేసిన ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీసులు తక్షణం స్పందించారు. సమాచారం అందుకున్న వెంటనే దర్శి డిఎస్పి లక్ష్మీనారాయణ, పొదిలి సిఐ వెంకటేశ్వర్లు, తర్లుపాడు పాడు ఎస్సై బ్రహ్మనాయుడు సంఘటన ప్రదేశానికి వెళ్లి బాధితురాలను పరామర్శించి ఆ మహిళను హుటాహుటిన వైద్యశాలకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి ఇద్దరినీ అరెస్ట్ చేశారు.

సుమారు 12 సంవత్సరాల క్రితం వారికి వివాహం అయింది. వారికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు సంతానం ఉన్నారు. గురునాథం భాగ్యలక్ష్మి కలుజువ్వలపాడు గ్రామములోని బేకరీ నందు పనిచేస్తున్నట్లు, గురునాథం భాగ్యలక్ష్మి భర్త బాలాజీకి మద్యం తాగే అలవాటు ఉన్నట్లు తెలిసింది. గురునాథం భాగ్యలక్ష్మిని అనుమానిస్తున్నట్లు ఫిర్యాదు ఉంది. ఈ నెల 13న రాత్రి షుమారు 09:30 సమయంలో గురునాథం భాగ్యలక్ష్మి కలుజువ్వలపాడు గ్రామము లోని బేకరీలో పని ముగించుకొని ఇంటికి వెళుతుండగా, మార్గ మధ్యలో గురునాథం భాగ్యలక్ష్మి భర్త బాలాజీ అతని కుటుంబ సభ్యులు కలిసి ఆమెను ఇంటికి తీసుకువెళ్లి చేతులు కట్టేసి బెల్ట్ తో వీపు పై కొట్టి, కాళ్ళతో, చేతులతో కొట్టారు. ఈ ఫిర్యాదు పై ప్రకాశం జిల్లా పోలీసులు స్పందించి కేసు నమోదు చేశారు. మహిళలు/ పిల్లలపై దాడులు జరిగితే సహించేది లేదని జిల్లా ఎస్పీ అన్నారు.

Related posts

ఐపీఎస్‌ అధికారిపై వరకట్న వేధింపుల కేసు

Satyam News

సైఫన్ గేట్లు తెరుచుకున్న సరళాసాగర్

Satyam News

ఆశ్రమంలో అపర వాల్మీకి జయంతి వేడుకలు

Satyam News

పర్యాటక రంగం అభివృద్ధితో మరింత గుర్తింపు

Satyam News

మళ్లీ ఎగురుతున్న ఇండిగో విమానాలు

Satyam News

బైక్ పై ముందు ఎస్పి… వెనుక మంత్రి

Satyam News

Leave a Comment