వీఆర్పీ క్రియేషన్స్ పతాకంపై వెంకటరమణ పసుపులేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “పవర్” చిత్రం గురువారం నాడు ప్రారంభమైంది. విజయవాడలోని ఘంటసాల ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ప్రాంగణంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సినిమా ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచ్ ఆన్ చేసి, తొలి క్లాప్ కొట్టారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. పరిమిత బడ్జెట్తో నూతన ఆలోచనలతో వస్తున్న ‘పవర్’ చిత్రం పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. చిత్రయూనిట్కు తన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, సినిమా విజవంతం కావాలని శుభాకాంక్షలు అందజేశారు.
