సినిమాహోమ్

సీడ్ గణేశుడిని స్వీకరించిన పూజా హెగ్డే

#PujaHegde

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన పర్యావరణ హిత సీడ్ గణేశ ప్రచారంలో భాగంగా ప్రముఖ నటి పూజా హెగ్డే ముంబైలో సీడ్ గణేశుడిని స్వీకరించారు. వేప, చింత వంటి స్థానిక వృక్షాల విత్తనాలను కలిపి సహజ మట్టితో తయారు చేసిన ఈ ప్రతిమలను పూజ అనంతరం ఇంట్లోనే నిమజ్జనం చేయవచ్చు. అప్పుడు విషపూరిత పీఓపీ విగ్రహాల బదులు ఒక మొక్క పెరిగి, భక్తి తో పాటు పచ్చదనం కూడా మిగులుతుంది.

ఈ సందర్భంగా సంతోష్‌కుమార్ ముంబై భక్తులకు పిలుపునిస్తూ, ఈ గణేశోత్సవంలో భక్తిని ప్రకృతి పరిరక్షణతో మేళవించాలని, నీటి వనరులను కలుషితం చేసే రసాయన రంగుల విగ్రహాలను వదిలేయాలని కోరారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కుటుంబాలు, సొసైటీలను సీడ్ గణేశ పూజ చేయాలని, మొక్కను పెంచాలని, ఇంకో ముగ్గురిని నామినేట్ చేసి పచ్చని వినాయకుడిని జరుపుకోవాలని విజ్ఞప్తి చేసింది.

Related posts

ఉపరాష్ట్రపతి పదవికి ఎన్టీఏ అభ్యర్ధి ఖరారు

Satyam News

శిథిలావస్థకు చేరుకున్న టిడ్కో ఇళ్లు

Satyam News

ఈ చేతి వాచ్ ఖరీదు రూ.13.7 కోట్లు…..!

Satyam News

పై వాడికి ఇవ్వాలి… చందాలు ఇవ్వండి…

Satyam News

విజయవాడ-తాడేపల్లి మధ్య వందల కార్లు చక్కర్లు..పవన్‌,లోకేష్‌ షాక్!

Satyam News

వెలిగొండ జలసిరులు… అభివృద్ధికి రెక్కలు

Satyam News

Leave a Comment