సినిమాహోమ్

సీడ్ గణేశుడిని స్వీకరించిన పూజా హెగ్డే

#PujaHegde

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకులు, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన పర్యావరణ హిత సీడ్ గణేశ ప్రచారంలో భాగంగా ప్రముఖ నటి పూజా హెగ్డే ముంబైలో సీడ్ గణేశుడిని స్వీకరించారు. వేప, చింత వంటి స్థానిక వృక్షాల విత్తనాలను కలిపి సహజ మట్టితో తయారు చేసిన ఈ ప్రతిమలను పూజ అనంతరం ఇంట్లోనే నిమజ్జనం చేయవచ్చు. అప్పుడు విషపూరిత పీఓపీ విగ్రహాల బదులు ఒక మొక్క పెరిగి, భక్తి తో పాటు పచ్చదనం కూడా మిగులుతుంది.

ఈ సందర్భంగా సంతోష్‌కుమార్ ముంబై భక్తులకు పిలుపునిస్తూ, ఈ గణేశోత్సవంలో భక్తిని ప్రకృతి పరిరక్షణతో మేళవించాలని, నీటి వనరులను కలుషితం చేసే రసాయన రంగుల విగ్రహాలను వదిలేయాలని కోరారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కుటుంబాలు, సొసైటీలను సీడ్ గణేశ పూజ చేయాలని, మొక్కను పెంచాలని, ఇంకో ముగ్గురిని నామినేట్ చేసి పచ్చని వినాయకుడిని జరుపుకోవాలని విజ్ఞప్తి చేసింది.

Related posts

వైసీపీ రాజకీయాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు శాపం!

Satyam News

తదుపరి సీఎస్ ఎవరు?

Satyam News

ఇండియా మ్యాప్ లో అమరావతి కి టిక్ మార్క్

Satyam News

పొలాల్లో విష పురుగులు ఉంటాయి జాగ్రత్త !

Satyam News

బొత్స సత్యనారాయణ కు బ్రెయిన్ స్ట్రోక్

Satyam News

అప్పుల బాధ తాళలేక వ్యాపారి ఆత్మహత్య

Satyam News

Leave a Comment